Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం‘జన గణన’కు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

‘జన గణన’కు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జన గణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది మొత్తంగా 16వ, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. రెండు దశల్లో జరగబోయే జనగణన.. 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది.
ఈసారి జన గణనతోపాటు కుల గణననూ చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad