Sunday, June 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలు2024-25 ఆర్థిక సంవ‌త్సరానికి జీడీపీ వృద్ది 6.5%

2024-25 ఆర్థిక సంవ‌త్సరానికి జీడీపీ వృద్ది 6.5%

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం(2024-25) ముగింపు నాటికి దేశ జీడీపీ 6.5శాతం ఉంద‌ని మినిస్ట‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమేటేష‌న్ శుక్ర‌వారం తాజాగా డేటాను వెల్ల‌డించింది. రానున్న ఆర్థిక సంవ‌త్సరానికి మంద‌స్తుగా NSO అంచ‌నా ప్ర‌కారం 6.5శాతం న‌మోదు కానుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది. అంతకుముందు ఆర్థిక యేడాదిలో నమోదైన 9.2 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా క్షీణత నమోదైంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి గానూ 7.4 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. అంతకుముందు ఏడాది నాలుగో త్రైమాసికంలో 8.4 శాతంగా వృద్ధి నమోదైందిఅంతేకాకుండా రెండు రోజుల క్రితం రిజ‌ర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా కూడా ఆర్థిక సంవ‌త్స‌రానికి(2024-25) దేశ జీడీపీ గ్రోత్‌ను 6.5శాతంగానే అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. అయితే 2047 సంవ‌త్సరం నాటికి భార‌త్ అన్ని రంగాల్లో వృద్ధి సాధించి.. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా మారుతుంద‌ని మోడీ ప్ర‌భుత్వం దీమా వ్య‌క్తం చేస్తుంది. ఆ కాలంనాటికి ప్ర‌తి ఆర్థిక సంవత్స‌రానికి 7.8శాతం జీడీపీ న‌మోదు చేస్తే..2047నాటికి భార‌త్ అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందుతుంద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -