– లండన్ సమావేశంలో ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్
– పరిశోధనా పత్రాన్ని సమర్పించి..అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలందుకున్నగీతం విద్యార్థులు
నవతెలంగాణ-పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో ఉన్న హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని ఉపన్యాసం చేశారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం గురువారం ప్రతికా ప్రకటన విడుదల చేసింది. లండన్లో ఈ నెల 13వ తేదీ జరిగిన అంతర్జాతీయ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్ (ఎఫ్ఐసీటీఏ2025) సదస్సులో ఆమె గీతంకు ప్రాతినిధ్యం వహించినట్టు తెలిపారు. లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) పరిశోధనా బృందం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నట్టు చెప్పారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్లో ఎదురయ్యే సవాళ్లు, వాటి వినియోగంపై గీతం అధ్యాపకులు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ కీలకోపన్యాసం చేశారన్నారు. విభిన్న పరిశ్రమల్లో ఏఐ-ఎంఎల్ క్లిష్టమైన పురోగతులు, వాస్తవ-ప్రపంచ వినియోగాల గురించి ఆమె వివరించినట్టు తెలిపారు. సెర్బియాలోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్య ఉపన్యాసకురాలిగా కూడా సేవలందిస్తున్న ప్రొఫెసర్ పర్వేకర్, అంతర్జాతీయ విద్యాపరమైన సంబంధాలు, సహకారాలకు ఊతమిస్తోందని తెలిపారు. ప్రొఫెసర్ పర్వేకర్ మార్గదర్శనంలో సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థులు జి.సోహన్ కుమార్ రెడ్డి, ఆదిచేతన్ ఖోట్, టి.ఆశ్రిత్, బి.మణిచరణ్ రెడ్డి తదితరులు ఈ-కామర్స్ సైట్ల కోసం ఆటోమేటిక్ ధర పర్యవేక్షణ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తెలిపారు. ఈ పత్ర రూపకల్పన కోసం వారు చేసిన కృషి, దాని ఔచిత్యం, అందులోని ఆవిష్కరణలు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు పొందాయన్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ, ప్రపంచ విద్యా కార్యకలాపాల్లో రాణించడం గీతం నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES