నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో పదికిపైగా ట్రేడ్యూనియన్లు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెతో గురువారం జనజీవనం స్తంభించింది. భువనేశ్వర్, కటక్ మరియు రూర్కెలాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి. భువనేశ్వర్లోని స్టేషన్ స్క్వేర్ సమీపంలో కార్మికులు పెద్ద సంఖ్యలో చేరుకుని దిగ్బంధించారు. ఆటోరిక్షా సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. నిరసన చేపట్టారు. జయదేవ్ విహార్ సమీపంలో జాతీయ రహదారి -16పై ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సమ్మెలో ఎఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, ఎస్ఇడబ్ల్యుఎ, ఎఐటియుసి మరియు ఎఐసిసిటియు సహా పలు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. వైద్య, అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక దళ సేవలు, నీటి సరఫరా వంటి ముఖ్యమైన సేవలను సమ్మె నుండి మినహాయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జయంత దాస్ తెలిపారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు బిజెడి ట్రేడ్ యూనియన్ విభాగం బిజు శ్రామిక్ సముఖ్య సమ్మెకు మద్దతు ప్రకటించాయి
ఇవాళ సార్వత్రిక సమ్మె..కార్మికుల భారీ ర్యాలీ
- Advertisement -
- Advertisement -



