Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలునగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే శుభవార్త

నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆస్తి పన్నుకు సంబంధించి సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులపై వన్ టైమ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం వరకు రాయితీ పొందవచ్చని నగరవాసులకు శుభవార్తను అందించింది.

ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రయివేటు మరియు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలియజేశారు.

వారికీ వర్తింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించిన విషయం తెలిసిందే. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ ద్వారా ప్రజలపై భారం తగ్గడంతో పాటు జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -