నవతెలంగాణ-చందుర్తి : వైద్యం వికటించి ఓ బాలిక మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టం పేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామానికి చెందిన కుదూరిక సరిత కూతురు మహాల (8) కి ఈ నెల 19న, కాళ్లకు తేలు కాటు వేసింది. జోగాపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ అనే ఆర్ ఎంపీ వద్దకు తీసుకెళ్లగా రెండు కాళ్లకు టీకా వేయగా బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో బాలికను వేములవాడ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిస్థితి సీరియస్ గా ఉందని కరీంనగర్ అపోలో.ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు.
ఆర్ ఎంపీపై కేసు నమోదు
ఈ నెల 25న,బాలిక తల్లి సరిత ఆర్ఎంపీపై స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయగా ఎస్సై రమేష్ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.
వైద్యం వికటించి బాలిక మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES