Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టాలు ఇచ్చిన ఇంటి స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వండి.. 

పట్టాలు ఇచ్చిన ఇంటి స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వండి.. 

- Advertisement -
  •  మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి 
  • – తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత
  • నవతెలంగాణ -తాడ్వాయి 
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ని కాటాపూర్ లో గత రెండు సంవత్సరాల క్రితం 2023 సంవత్సరంలో ఒక్కొక్కరికి 75 గజాల ఇంటి స్థలాన్ని 108 లబ్ధిదారులకు మందికి అందజేశారని, వాటిని ఎవరి వారికి అందిస్తే వారు గుడిసెలేసుకుంటారని మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తాసిల్దార్ సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
  • ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 75 గజాలు చొప్పున 108 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారని, ఇప్పుడు అధికారులు ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు ఇంటి స్థలాలు ఇవ్వడంతో ఎంతో సంతోషించామని తమలో కొందరు ఎందుకు లేకున్నారని అయితే అధికారులు తిరిగి ఆ స్థలాలను ఎందుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో అని మండిపడ్డారు.
  • ఎన్నోసార్లు తాసిల్దార్, కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.
  • ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న తాసిల్దార్, కలెక్టర్ స్పందించి పేదల పంచి ఇచ్చిన స్థలాలను ఎవరి వారికి ఇస్తే ఇల్లు కట్టుకుంటారని ఆయన అన్నారు. లేదంటే లబ్ధిదారులతో ఉద్యమాన్ని కుదురుతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందాక లాలయ్య, మాజీ సర్పంచ్ మేడిశెట్టి నరసింహయ్య, నాయకులు సాయిరీ లక్ష్మీ నరసయ్య, తడక సాయి, పాయం సమ్మయ్య, లబ్ధిదారులు లంజపెల్లి రాంబాబు, సత్యనారాయణ, రాజేశ్వరి, స్వాతి, నాగలక్ష్మి, శారద, బిక్షపతి, స్వప్న, రమా, అనసూయ, నిర్మల, రామా, రేణుక తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -