- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.950 పెరిగి రూ.1,36,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,030 పెరిగి రూ.1,49,290 పలుకుతోంది. వెండి ధర అత్యంత భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.2,50,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -



