Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్

ఏటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఏటీఎం) చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యతను పెంచాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆదేశాల అమలులో బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఆర్‌బీఐ నిర్దేశించిన సెప్టెంబర్ 30 గడువుకు మూడు నెలల ముందే దేశంలోని 73 శాతం ఏటీఎంలు ఇప్పుడు రూ.100 లేదా రూ.200 నోట్లను కనీసం ఒక క్యాసెట్ నుంచి జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎంలలో 73,000 ఏటీఎంలను నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 2024లో 65 శాతంగా ఉన్న ఈ చిన్న నోట్ల లభ్యత ప్రస్తుతం 73 శాతానికి పెరిగినట్టు ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad