నవతెలంగాణ – హైదరాబాద్: ద్విచక్ర వాహన తయారీదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో రెండు హెల్మెట్ లను అందించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్తనియమాన్ని అమల్లోకి తీసుకురావడానికి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మెటారు వాహనాల నిబంధనలు 1989కి ముఖ్య సరవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. జూన్ 23, 2025న ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర వాహన తయారీదారులు, కొనుగోలు దారులకు రెండు హెల్మెట్లను అందించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా తయారు చేసిన హెల్మెట్లనే కొనుగోలుదారులకు అందించాల్సి ఉంటుంది.
కొత్త టూ విలర్ కొనేవారికి శుభవార్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES