Saturday, February 28, 2026
E-PAPER
Homeఆటలుఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్...

ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది. ‘‘అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు హోం శాఖ, కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం’’ అని కేఎస్‌సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సూచించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులకు అనుగుణంగా మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -