- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులకు డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో డీఏ 50.7 శాతం నుంచి 52.8 శాతానికి పెరగనుంది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. గడిచిన మూడు నెలల బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది.ఈ నిర్ణయంతో ఆర్టీసీపై ప్రతి నెల సుమారు రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఉద్యోగులకు మాత్రం పెద్ద ఉపశమనం కలగనుంది.
- Advertisement -



