Sunday, February 22, 2026
E-PAPER
Homeజాతీయంప‌ర్యాట‌కుల‌కు తీపిక‌బురు

ప‌ర్యాట‌కుల‌కు తీపిక‌బురు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశీయ‌, విదేశీ ప‌ర్యాట‌కుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని చారిత్ర‌క క‌ట్ట‌డం ఎర్ర‌కోట ఇక‌పై వారంలో అన్ని రోజులు సంద‌ర్శ‌కుల కోసం అందుబాటులో ఉండ‌నుంది. సోమ‌వారం రోజున ఎర్ర‌కోట‌ను మూసివేసే ప‌ద్ధ‌తిని ర‌ద్దు చేసిన‌ట్లు భార‌త్ పురావ‌స్తు స‌ర్వే సంస్థ అధికారులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఏఎస్ఐ డైరెక్ట‌ర్ ఫిబ్ర‌వ‌రి 13న జారీ చేసిన ఉత్త‌ర్వులు ఇప్ప‌టికే అమ‌లులోకి వ‌చ్చాయ‌ని, ఫిబ్ర‌వ‌రి 16న ఎర్ర‌కోట‌ను సంద‌ర్శ‌కుల కోసం తెరిచే ఉంచామ‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -