- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 పతనమై రూ. 1,10,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
- Advertisement -



