- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి రైల్లే స్టేషన్ యార్డ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది . గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున రెండు పాల ట్యాంకర్ బోగీలు పక్కకు జరిగాయి. దీంతో ట్రాక్ దెబ్బతిని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది, రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
- Advertisement -



