- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని గుగ్గీళ్ల,పోతారం శివారుల్లో నిర్మించిన గ్రీన్,వైట్ ఫీల్డ్ ఇథనాల్ పరిశ్రమలు నీరు, వాయు,శబ్దంతో కాలుష్యం చిమ్ముతున్నాయని తక్షణమే పరిశ్రమలను నిలిపివేయాలని గుగ్గీళ్ల పంచాయతీ పాలకవర్గం సభ్యులు సోమవారం కలేక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో పిర్యాదు చేసినట్టు సర్పంచ్ గుగ్గీళ్ల మల్లయ్య తెలిపారు.ఇథనాల్ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల రైతులు తమ వ్యవసాయ సాగు భూములను కోల్పోతున్నామని పాలకవర్గం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం,జిల్లాధికారులు మానవత్వంతో స్పందించి పరిశ్రమలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



