చివరిగింజ వరకు కొనుగోలు చేస్తోంది.
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు: ఇటీవల కురిసిన అకాల గాలివాన బీభత్సవానికి తాడిచెర్లతోపాటు ఆయా గ్రామాల్లోని వరిదాన్యం తడిసి ముద్దయింది. మరికొంత ధాన్యం రంగు మారింది. అయితే రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వం అధికారులతో సర్వేలు చేపట్టి పంట నష్టపరిహారం అందిస్తోందని, తడిసిన ధాన్యం చివరి వరిగింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తాడిచెర్ల, మల్లారం, పెద్దతూoడ్ల, గాదంపల్లి, దుబ్బపేట, కొయ్యుర్, రుద్రారం, ఎడ్లపల్లి, కొండంపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తాడిచెర్లలో ఎక్కువగా ధాన్యం తడిసిపోయిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటోoదన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో సంబంధించిన ఉన్నతాధికారులు పంటనష్టం సర్వేలు నిర్వహించి నష్టపరిహారం అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల రాహుల్, జక్కుల వెంకటస్వామి యాదవ్, పిఏసిఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES