- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్లకు సంబంధించి, తమకు వివరాలు సబ్మిట్ చేయాలని డీపీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. 2021 డిసెంబరు జీవో 317, 2022, 2024 రీ-అలోట్మెంట్లలో ప్రయోజనం లభించని వారిని పరిగణనలోకి తీసుకుని, జీవో 190 ప్రకారం డిప్యూటేషన్లు కల్పించాలని టీపీఎస్ఏ అభ్యర్థనపై అన్ని జిల్లాలకు మెమో జారీ చేశారు. వివరాలు అందాక డిప్యూటేషన్లు అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
- Advertisement -