Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని పోచంపల్లి, గంట్లకుంట, చిట్యాల గ్రామాల్లో కలెక్టర్ బుధవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, ధాన్యం కొనుగోలు, సేకరణ రవాణా పై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ధాన్యం తరలింపుపై జాప్యం ఉన్నచోట సంబంధిత అధికారులతో ఆయన స్వయంగా మాట్లాడి, వెంటనే ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు.‌ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయినందున దానికనుగుణంగా కేంద్రాల నిర్వహణ చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయుటకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు, అదనపు కలెక్టర్, తాను స్వయంగా తిరుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుండి ధాన్యం పూర్తి స్థాయిలో సేకరిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్నారు.

రుతుపవనాల రాకతో రానున్న ఒకటి, రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులకు సంబంధించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, డబ్బులు త్వరగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా సంబంధిత శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చివరి దశలో ఉన్న ధాన్యం కొనుగోళ్లు, సేకరణ రవాణా తదితర అంశాలపై అధికారులు, కేంద్రాల నిర్వహకులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ వీరగంటి మహేందర్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -