- Advertisement -
- – బడిబాట విజయవంతానికి కార్యాచరణ…
– పంచాయితీ జిల్లా అధికారి చే ఉత్తర్వులు జారీ…
– అమలు చేయాలని కార్యదర్శులకు ఎంపీడీఓ లు ఆదేశం… - నవతెలంగాణ – అశ్వారావుపేట
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 2025 – 2026 కార్యాచరణ విజయవంతం చేయడానికి నేడు 06 జూన్ 2025 శుక్రవారం పంచాయతీ స్థాయిలలో కార్యదర్శులు ఆద్వర్యంలో గ్రామ సభలు చేపట్టాలని జిల్లా పంచాయితి అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను తప్పని సరిగా అమలు చేయాలని ఎంపీడీఓ లు కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం జిల్లా విద్యాశాఖ అధికారి,పంచాయితీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 2025 – 2026 సంవత్సరానికి సంబందించిన ప్రోగ్రామ్ ఎస్.ఎం.సీలు, తల్లిదండ్రులు, స్వయం సహాయక బృందాలు, ప్రజాప్రతినిధులు,స్వచ్చంద సంస్థలు,పంచాయతీరాజ్, పంచాయతీ గ్రామీణాభివృద్ధి పురపాలక శాఖల సమన్వయంతో బడిబాట సందర్భంగా పాఠశాలల్లో నమోదును మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు, హెచ్ ఎం లు కృషి చేయాలని హైదరాబాద్లోని టీ.ఎస్.ఎస్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు.
- జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 2025-26 (ది. 12.08.2019 నుండి 19.06.2019 వరకు) ప్రచారము చేసే అన్ని ఆవాస ప్రాంతములో గల బడి ఈడు గల పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం వారు సూచన ద్వారా ఆదేశించారు. పై విషయములో జిల్లాలోని అందరు మండల పంచాయతీ అధికారులు,పంచాయితీ కార్యదర్శులను ఈ క్రింది సూచనలు అమలు చేయాలి.
1)ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 2025-26 (ది. 12.06.2019 నుండి 19.06.2019 వరకు వరకు) ప్రచారము నిర్వహించాలి. - 2)అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలలు, వసతి గృహాలు (హాస్టల్స్), అంగన్వాడి కేంద్రాల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వ నిర్వహించాలి.
- 3)అన్ని గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న పాఠశాలలు, వసతి గృహాలు (హాస్టల్స్), అంగన్వాడి కేంద్రాల వద్ద త్రాగు నీటికి సంబందించి ట్యాప్ లు చేతి పంపులు సరిచేసి త్రాగు నీటి సరఫరా సక్రమముగా ఉండేలా చూడాలి.
- 4)అన్నీ గ్రామ పంచాయితీల లోని ఆవాస ప్రాంతాలలో రహదారులు శుభ్ర పరచాలి.
- అన్ని గ్రామ పంచాయితీల పరిధిలోని అందరు ప్రత్యేక అధికారులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి.
- 5)అన్ని గ్రామ పంచాయితీల లోని ఆవాస ప్రాంతాలలోని బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తగు చర్యలు చేపట్టాలి
- 6)పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించడం బడిబాట కార్యక్రమంలో భాగంగా ది:06.06.2025 గ్రామ పంచాయతీ స్థాయిలలో పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రత్యేక అధికారులు భాగస్వాములు కావలెను. గ్రామ స్థాయి ప్రతి నిధులు, గ్రామ పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు, యువత, స్వచ్చంద సంస్థ వారిచే ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ మరియు ర్యాలీలు నిర్వహించడం జరగాలి.
7)ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల కలిగి ఉన్న ప్రయోజనాలు గురించి పిల్లలకు మరియు తల్లి దండ్రులకు విద్యా విధానం, మధ్యాహ్న భోజనం,వ్యక్తిగత శుభ్రత,దుస్తులు వంటి వాటిపైన అవగాహన గురించి తెలియ జేయుట కావున, జిల్లాలోని అందరు మండల పంచాయతీ అధికారులు,పంచాయితీ. కార్యదర్శులను, ప్రత్యేక అధికారులకు పైన తెలిపిన కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసారు.
- Advertisement -