- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామంలో విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు యోగ ఆధ్యాపకులైన ఎడ్ల రామ్ ఆధ్వర్యంలో జ్ఞానపరమైన,ఆరోగ్యకరమైన, మనసు ప్రశాంతతకు సంబంధిత యోగ ఆసనాలను పిల్లలకు నేర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్స్ పాల్ ఏంకే సుదర్శనన్, వైస్ ప్రిన్సిపాల్ మెర్సీ వర్గీస్ మాట్లాడారు యోగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి, పిల్లల జ్ఞాపకశక్తికి, పిల్లల సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు.
- Advertisement -