- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం గండిగుట్ట గిరిజన తండాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాననికి భూమి పూజ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి సాయి రెడ్డి,జావిద్ ఉద్దీన్, ధనుంజయ్, హౌసింగ్ ఏఈ సాయి కరణ్, గ్రామ కార్యదర్శి శిభ శబనం, స్థానిక నాయకులు రామచందర్ ప్రకాష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -