Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏపీలో గ్రూప్-1 మెయిన్స్ రిజల్ట్స్ విడుదల

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ రిజల్ట్స్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీసుల భర్తీ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించగా, సుమారు నాలుగు వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే ఏపీపీఎస్సీ ఎటువంటి జాప్యం లేకుండా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించడం గమనార్హం. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad