- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్లోని ఊనా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తమ ఇంట్లో జామ పండ్లు కోసిందని రిటైర్డ్ ఆర్మీ అధికారి బాలికను గొలుసులతో కట్టివేసి, చిత్రహింసలకు గురిచేశాడు. తనను వదిలేయమని బాలిక వేడుకున్నా కనికరించలేదు. మెరైన్ ఇంజనీరింగ్లో పని చేస్తున్న రోహిత్ అనే యువకుడు ఈ ఘోరాన్ని వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



