No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఆటలువిజయోత్సవాలకు మార్గదర్శకాలు

విజయోత్సవాలకు మార్గదర్శకాలు

- Advertisement -

– త్రిసభ్య కమిటీ వేసిన బీసీసీఐ
ముంబయి:
ఐపీఎల్‌18 చాంపియన్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ విజయోత్సవాలు పెను విషాదం మిగిల్చగా.. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలను నివారించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇందుకోసం శనివారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో త్రి సభ్య కమిటీని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. త్రి సభ్య కమిటీలో ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా, రాజీశ్‌ శుక్లాలు సభ్యులు కాగా.. దేవాజిత్‌ సైకియా చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. త్రి సభ్య కమిటీ 15 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించి బోర్డుకు అందజేయనుంది. దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌ అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీల పనితీరు పర్యవేక్షణకు ఐదుగురు, ముగ్గురు సభ్యులతో కమిటీలను సైతం వేసేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మృతులకు బీసీసీఐ సంతాపం తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad