- Advertisement -
- – ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం : పంచాయతీ కార్యదర్శి శరత్
నవతెలంగాణ – నెల్లికుదురు - ప్లాస్టిక్ రహిత గ్రామంగా మన బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని తీర్చి దిద్దు కుందమని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు గ్రామంలో వీధులలో ప్లాస్టిక్ ఎక్కడబడితే అక్కడ వేయవద్దని అసలు గ్రామానికి ప్లాస్టిక్ వాడకన్ని వాడవద్దని అన్నారు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరినట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అంగన్వాడీ ఆశాలు గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -