ఉత్తమ ఎంపీడీవో కుమార్ కు ప్రిన్సిపాల్ ఘన సన్మానం
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు
నవతెలంగాణ- నెల్లికుదురు
నెల్లికుదురు మండల ఎంపీడీవో సింగారం కుమార్ ఉత్తమ ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు తెలిపారు. గురువారం ఆయనకు శాలువతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సాధించి ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారుల ఆదేశాల సారం విధులు నిర్వహించడం వల్ల ఆయనకు ఉత్తమ ఎంపీడీవో ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఇలాంటి ఎంపీడీవో కుమార్ మండలానికి ఉండడం సంతోషంగా ఉందని తెలిపారు .
ఉత్తమ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషం
- Advertisement -
- Advertisement -



