- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కేటీఆర్. డిహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు కేటీఆర్. కాగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. దింతో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రిలో చేశారు హరీష్ రావు.
- Advertisement -