- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీలంకతో ఐదో టీ20లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ చివర్లో అరుంధతి రెడ్డి (27*) బ్యాట్ ఝళిపించింది. అమన్జ్యోత్ (21), హర్లీన్ (13), కమలినీ (12) పరుగులు చేశారు. షెఫాలీ వర్మ (5), రిచాఘోష్ (5), దీప్తిశర్మ (7) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు, నిమష ఒక వికెట్ తీశారు.
- Advertisement -



