Saturday, May 17, 2025
Homeజాతీయంపాక్‌కు గూఢచర్యం.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌

పాక్‌కు గూఢచర్యం.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న హర్యానాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని అధికారులు తాజాగా అరెస్ట్‌ చేశారు. సదరు విద్యార్థి దేశంలో గూఢచర్యం చేస్తూ, పాక్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
హర్యానాలోని మస్త్‌గఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏండ్ల దేవేంద్ర సింగ్‌ ధిల్లాన్‌.. పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుతున్నాడు. అయితే, అతడు ఇటీవలే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పిస్టోల్, గన్‌ చిత్రాలను అప్‌లోడ్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్‌ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్‌కు చేరవేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అధికారులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గతేడాది నవంబర్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా పాక్‌కు వెళ్లిన దేవేంద్ర.. పాక్‌ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తేలింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -