నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఈ నేపథ్యంలో తుర్కియే దేశం కీలక ప్రకటన చేసింది. సాంకేతికపరంగా తలెత్తిన సమస్యలపై తమ దేశంపై ఆధారాలేని ఆరోపణలు వస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు అవాస్తవమని, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తుర్కియే ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. టర్కిష్ టెక్నిక్ ఎయిర్ ఇండియాతో నిర్వహణ ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అది బోయింగ్ 777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమే పరిమితం అని, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ను కవర్ చేయదని ఆదేశం పేర్కొంది.
ఎయిరిండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందం జరిగిందని పేర్కొంది. ఈ ఒప్పందం కింద 787-రకం విమానాలు ఏ సేవలు అందించబడలేదు. ఇప్పటి వరకు, టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఎటువంటి ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ నిర్వహించలేదు అని టర్కీ ఓ ప్రకటనలో నొక్కి చెప్పింది. మరోవైపు ఈ ప్రమాదంపై భారతదేశ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఈ సంఘటనపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 కూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది మరణించారు. అదేవిధంగా హాస్టల్ భవనంలో ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా మరో 14 మంది మరణించారు. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.