నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గురువారం తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆస్పత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తీవ్ర జ్వరంతో కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు తేలిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నారు.
మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు.. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.