- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ లో మూడోసారి స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ కు బీసీసీఐ రూ.30 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో మూడో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్ గా నిలిచాడు. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి పంత్ ఎక్కువగా సమయం తీసుకున్నాడు.
- Advertisement -