- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ఏడు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,632 క్యూసెక్కులను అదనంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 1,17,221 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 882.10 అడుగులు, నీటి నిల్వ 199.2737 టీఎంసీలుగా నమోదైంది.
- Advertisement -