నవతెలంగాణ-నిజాంసాగర్: ఎక్కువ ప్రాంతాలతో పాటు జిల్లాలో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1,08,363 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా.. 5 వరద గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మంజీరా నదిలోకి 38,935 క్యూసెక్కుల నీటిని, ప్రధాన కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 14.803టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. కాబట్టి కాలువ,నది పరివాహక ప్రాంతలలోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES