నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కారణంగా ఓ పాఠశాల క్లాస్ రూమ్ లీకవుతుండటంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు. ఉపాధ్యాయులు సైతం గొడుగులు పట్టుకునే పాఠాలు బోధించారు. ఈ ఘటన హుగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. గత వారంరోజులుగా బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హుగ్లీలోని ప్రాథమిక పాఠశాల మొత్తం లీకవుతోంది. మూడు తరగతి గదులు మినహా మిగతావాటన్నింటిలోనూ వర్షం నీరు కారుతోంది. దీంతో విద్యార్థులు గొడుగుల సాయంతో పాఠాలు విన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 1972లో స్థాపించిన ఈ పాఠశాల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరింది. కేవలం మూడు గదులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అవి కూడా పేలవమైన స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భారీ వర్షం.. క్లాస్రూమ్లో గొడుగులు పట్టుకుని పాఠాలు విన్న విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES