నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వర్షాలకు హిమాచల్ప్రదేశ్లోని పలు జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు నదులు ఉప్పొంగి.. ఒడ్డున ఉన్న గృహాలు వరద ఉద్ధృతికి కొట్టుకుని పోతున్నాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహ వేగంతోపాటు నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు
ఈ క్రమంలో తాజాగా ఆ రాష్ట్ర పోలీస్ యంత్రంగా కూడా భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచిందింది. పర్వతాల ప్రాంతాల జనాలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియల ప్రదేశాలకు వీలునైంత దూరంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలలో, అధిక వరదలు సంభవించే ప్రాంతాలు, వాటి ధాటికి కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు గురైయ్యే అవకాశముందని..ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అదే విధంగా నదులు, వాగులు, ఆనకట్టలకు దగ్గర నివసించే ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉప్పొంగుతున్న నదులు, కుంటలు, జలపాతాల నుండి దూరంగా ఉండాలని సూచించారు.