నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో జోరుగా రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జమ్ముకశ్మీర్లోని రంబన్ ప్రాంతంలో భారీ వానాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు వరద నీరు రోడ్లపై ఉప్పొంగుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాహనదారులు పలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శ్రీనగర్ లో కూడా భారీ వర్షాలకు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి.
అంతేకాకుండా అసోంలోని గౌహతిలో కూడా ఎడతెరిపి లేకుండా వానాలు పడుతున్నాయి. దీంతో భారీ వర్ష నీరు వీధుల్లోకి చేరి పోయింది. పలు కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నీరుకు పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

అదేవిధంగా రానున్న భారీ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. పది రోజుల క్రితం ఢిల్లీలో కురిసిన వర్షాలకు పలు ముఖ్యమైన నగరాల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాదారులు గంటల కొద్ది రోడ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం వ్యూహారచన చేస్తోంది. నీటి ఎద్దటితో అధికంగా ప్రభావితమై ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక సిబ్బందిని కేటాయించి కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు.

