Tuesday, May 6, 2025
Homeజాతీయంగుజరాత్‌ను ముంచిన భారీ వ‌ర్షాలు

గుజరాత్‌ను ముంచిన భారీ వ‌ర్షాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు క‌కావిక‌లం చేశాయి. రాష్ట్రంలోని 168 తాలుకాల్లో సోమవారం అకాల వర్షాలు కురిశాయి. కొన్ని తాలూకాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వానతో పాటు పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలతో స‌హా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. . దీంతో వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. అందులో ఖేడా జిల్లాలో నలుగురు, వడోదర నగరంలో ముగ్గురు, ఆరావళి, దాహోద్‌ల్లో ఇద్దరు చొప్పున, అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్‌, దస్క్రోయ్‌ల్లో ఒక్కొక్కరు, ఆనంద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 16 మంది గాయపడ్డారు. 26 మూగజీవాలు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -