నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించగా.. 65 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ఆధారంగా.. వర్షాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాలు, వంతెనల నుంచి పడిపోవడం, మునిగిపోవడం, పిడుగుపాటు, అగ్నిప్రమాదాల వంటి ఘటనలలో ఈ మరణాలు నమోదయ్యాయి. ముంబై సిటీ, ముంబై సబర్బన్, రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ జిల్లాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి, దీంతో అనేక ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడంతో తీవ్ర సమస్యలు తలెత్తాయి. భారత వాతావరణ శాఖ కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో జూన్ 16న రెడ్ అలర్ట్ జారీ చేయగా.. 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి.
ముఖ్యంగా రాయ్గఢ్ జిల్లాలో ఒక రోజులో 280 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాలైన ముంబైలోని కొలాబా (160 మి.మీ.) లోనావల (70 మి.మీ.)లో కూడా గణనీయమైన వర్షపాతం రికార్డయింది. జూన్ 15న పుణె జిల్లాలోని కుందమాల గ్రామం సమీపంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కూలిపోవడంతో నలుగురు మరణించారు. అలాగే 40 మందికి పైగా గాయపడ్డారు. రాయ్గఢ్, పుణె, ముంబైలో నీటి నిల్వ కారణంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ల కోసం మోహరించబడ్డాయి. ప్రస్తుతం కూడా వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
మహారాష్ట్రలో జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించగా.. 65 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ఆధారంగా.. వర్షాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాలు, వంతెనల నుంచి పడిపోవడం, మునిగిపోవడం, పిడుగుపాటు, అగ్నిప్రమాదాల వంటి ఘటనలలో ఈ మరణాలు నమోదయ్యాయి. ముంబై సిటీ, ముంబై సబర్బన్, రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ జిల్లాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి, దీంతో అనేక ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడంతో తీవ్ర సమస్యలు తలెత్తాయి. భారత వాతావరణ శాఖ కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో జూన్ 16న రెడ్ అలర్ట్ జారీ చేయగా.. 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి.
ముఖ్యంగా రాయ్గఢ్ జిల్లాలో ఒక రోజులో 280 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాలైన ముంబైలోని కొలాబా (160 మి.మీ.) లోనావల (70 మి.మీ.)లో కూడా గణనీయమైన వర్షపాతం రికార్డయింది. జూన్ 15న పుణె జిల్లాలోని కుందమాల గ్రామం సమీపంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కూలిపోవడంతో నలుగురు మరణించారు. అలాగే 40 మందికి పైగా గాయపడ్డారు. రాయ్గఢ్, పుణె, ముంబైలో నీటి నిల్వ కారణంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ల కోసం మోహరించబడ్డాయి. ప్రస్తుతం కూడా వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.