నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర – ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నందున రేపు (మే 31) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండి) శుక్రవారం తెలిపింది. రాబోయే 12 గంటల్లో అల్పపీడనం బలహీనడుతుంది. దీంతో కేరళ, కర్ణాటక తీరప్రాంతం తమినాడు ఘాట్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో మే 30న భారీ వర్షాలు కురిశాయి. ఈశాన్య భారతదేశంలో రాబోయే 7 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
మరోవైపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు క్రితం ముంబాయిలో కురిసిన భారీ వానాలకు పలు కాలనీలు నీటమునిగాయి. ఎక్కడికక్కడ నీరు నిల్వడంతో రోడ్లలన్నీ వరద నీటితో నిండి చెరువులను తలపించాయి. తాజాగా కేరళలో వానాలు దంచికొడుతున్నాయి. కక్కడ్ నది నీటి మట్టం పెరగడంతో, తీరప్రాంత నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.అంతేకాకుండా క్రమక్రమంగా నీటి ప్రవాహాం పెరుగుతు రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాదారులు రాకపోలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పిటికే భారత్ వాతావరణ శాఖ రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై..వర్ష ముప్పు ఉన్న ప్రాంతాలను అలర్ట్ చేసింది. ఆయా ప్రాంతాల ప్రభుత్వ అధికారులుసహాయక చర్యలు చేపట్టానికి ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
