- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జపాన్లోని అనేక ప్రాంతాల్లో గత రెండు వారాలుగా భారీ హిమపాతం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. అతిశీతల వాతావరణం కారణంగా గుండెపోటు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారీ మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థతో పాటు ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- Advertisement -



