- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు చిట్యాల రైలు వంతెన కింద వరద నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -



