- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా హెలికాఫ్టర్ కుప్ప కూలింది. నేపాల్ వైపు ఎవరెస్టు శిక్షరం వద్ద తీవ్రంగా మంచు కురుస్తుండగా.. అక్కడ చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్పై ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ జారిపడి లోబుచేలో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
- Advertisement -

 
                                    