నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి భారత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆపరేషన్ సింధూ పేరుతో ఇరాన్ దేశంలో ఉన్న భారతీయ పౌరులను ప్రత్యేక విమానం ద్వారా తరలిస్తున్నారు.అయితే భారత్ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక ప్రభుత్వాలు ఇండియా సర్కార్ను కీలక విజ్ఞప్తి చేశాయి. తమ విద్యార్థులను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ను కోరాయి. దీంతో ఆయా దేశాల పౌరులను ఆపరేషన్ సింధులో భాగంగా విమానాల్లో తరలించాలని నిర్ణయించింది. టెహ్రాన్లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలాఉండగా.. ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటివరకు 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని భారత విదేశాంగశాఖ శనివారం తెలిపింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా 290 మంది శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించింది. కాగా.. ఇటీవల 110 మంది విద్యార్థులు ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు.