నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్కు సంబంధించిన ఓ ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా, కనీసం ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం అక్షయ్ కుమార్ నివాసం సమీపంలోని జూహు ప్రాంతం సమీపంలో జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఓ ఆటోరిక్షా, వేగంగా వచ్చిన కారును ఢీకొనడంతో పరిస్థితి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాత్రి సుమారు 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన కారులో అక్షయ్ కుమార్ లేరు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కారును పక్కకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్షయ్ కుమార్, భార్య ట్వింకిల్ ఖన్నా ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ సమయంలో హీరో మాత్రం వేరే వాహనంలో ఉన్నట్టు తెలుస్తోంది.



