- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు కొనసాగుతున్నాయి. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు, సీఎం ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు.
- Advertisement -