- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై గతంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ జోషి సవాల్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



