నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఉన్నత విద్య)ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి సోమవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశోధనలు బలోపేతం కావడానికి ఇది మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఉన్నత విద్యలో పరిశోధనలు మెరుగవుతాయనీ, అకడమిక్ ఎక్స్లెన్స్ ఉంటుందనీ, ఆధారాలతో కూడిన విధానాలు అమలవుతాయని అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, విద్యారంగంలో ఉన్న సవాళ్లు, విద్యారంగ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయడానికి అవకాశముంటుందని వివరించారు. ఉన్నత విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విద్యను అందించడంలో ఉన్నత విద్యామండలి పాత్ర గురించి ఈ జర్నల్లో ప్రచురించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్య-తెలంగాణ జర్నల్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES