నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్లోని పూంచ్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ దాడి చేయగా..ఎల్ఓసీ వెంబడి సామాన్య పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ దాడులను భారత్ బలగాలు తిప్పికొట్టిన పలు గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలో పాక్ కాల్పులకు ప్రభావితమైన పూంచ్ పరిధిలోని పలు ప్రాంతాలను అమిత్ షా సందర్శించారు. బాధితులను కలిసి స్వయంగా మాట్లాడారు. కాల్పుల్లో ధ్వంసమైన తమ ఇండ్లకు పరిహారం అందించాలని బాధితులు హోంమంత్రిని కోరారు. బాధితులను అన్ని విధాలుగా అండ ఉంటామని హామీ ఇచ్చారు.
కాగా, ఏప్రీల్ 22న పహల్గాం దాడిలో 26మంది అమాయక పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం..ఆ దేశంపై దౌత్యపరంగా అనేక ఆంక్షలు విధించారు. అంతేకాకుండా పాక్ కేంద్రం వెలిసిన ఉగ్రశిబిరాలపై మే7న ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో వందమందిగా పైగా తీవ్రవాదులు హతమైయ్యారు. ఈ తర్వాత నాటకీయ పరిణామాలతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి యుద్దం ముగిసింది.
